ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై పార్టీ నాయకులతో తాను మాట్లాడానని, వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. కాగా కన్నాకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని, దీనిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారని గుర్తుచేశారు. బీజేపీలో ఇవి రెండూ చాలా కీలకమైన పదవులని తెలిపిన ఎంపీ జీవీఎల్.. అందులోనూ బయటి పార్టీనుంచి వచ్చిన వ్యక్తికి ఇవి లభించడమంటే అంత తేలికైన విషయం కాదని పేర్కొన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనేనని, గతంలో కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆయన అనేక వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి చెప్పే చేశారని, ఆయన ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని జీవీఎల్ పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వీర్రాజు పైనే కాదని, తనపై కూడా ఇప్పుటి కన్నా ఎక్కువగా గతంలో చాలా విమర్శలు చేశారని చెప్పారు. ఇక తన పరిధిలో తాను పని చేస్తున్నానని, కన్నా తనపై చేసిన విమర్శలపై మాట్లాడదలచుకోవడం లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కాగా అంతకుముందు తన రాజీనామాకు దారితీసిన పరిస్థితుల గురించి కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు మరియు ఎంపీ జీవీఎల్ పైన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. సోము వీర్రాజు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE