విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 11 మంది మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఏన్జిటీ) స్పందించింది. ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాలని ఎల్.జి.పాలిమర్స్ సంస్థకు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జారీ చేసింది.
ఈ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణ నష్టం చోటు చేసుకోవడంతో రూ.50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలనీ ఎల్.జి.పాలిమర్స్ సంస్థను ఏన్జిటీ ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏన్జిటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu