టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత డీలా పడిన నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపి, తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జిల్లాల వారీగా వరుస పర్యటనలు చేపట్టి పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా ముందుగా తూర్పుగోదావరి జిల్లాను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీలలో జిల్లాలో పర్యటించి, నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా కాకినాడ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. తోలి విడతలో ముమ్మిడివరం, తుని, రామచంద్రపురం నేతలతో చంద్రబాబు సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన విధానాలపై చర్చించారు. రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు ఈ రోజు సమీక్షా సమావేశానికి గైర్హజరయ్యారు. మిగిలిన పిఠాపురం, కాకినాడ, మండపేట, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలతో సాయంత్రం లోపు సమావేశమయ్యి వారికీ పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
[subscribe]
[youtube_video videoid=XCrlHD8Gxrg]