తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూరియా సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ కూడ యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వలనే యూరియా సమస్య వచ్చిందన్నారు. ప్రభుత్వం అడిగిన వెంటనే కేంద్రం 50 శాతం యూరియాని పంపిందని తెలిపారు. మరో 50 శాతం యూరియా రెండు రోజుల్లో రాష్టానికి చేరుకుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలనే సమస్య వచ్చిందని, రాష్ట్రము అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం యూరియా పంపుతుందని తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=sn6siFkPMdY]