మెగాస్టార్ చిరంజీవి, శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోగల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం నాడు కన్నబాబు సోదరుడు సురేష్ బాబు ఆకస్మిసంగా గుండె పోటుతో మరణించారు. ఈ వార్త తెలుసుకున్న చిరంజీవి, సోదర వియోగంతో బాధపడుతున్న కన్నబాబు ని పరామర్శించేందుకు కాకినాడ వచ్చారు. హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడినుంచి కాకినాడ చేరుకొని కన్నబాబు కుటుంబ సభ్యులను ఓదార్చి, తిరిగి వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.
2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు, కన్నబాబు కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి రాజకీయ సలహాదారుడిగా కూడా వ్యవరించారు. 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, ప్రజారాజ్యం తరుపున కాకినాడ రూరల్ స్థానం నుండి పోటీ చేసి కన్నబాబు విజయం సాధించారు. అప్పటినుంచి, ఇద్దరిమధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇటీవల వైసీపీ తరుపున గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న సందర్భంలో కూడ, తన జీవితంలో చిరంజీవి పాత్ర గురించి కన్నబాబు మాట్లాడారు.
[subscribe]
[youtube_video videoid=mEm3YH5wWJk]