సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. సతీసమేతంగా హాజరైన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన జస్టిస్ రమణకు ఎండోమెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఘనస్వాగతం పలికారు. ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న సీజేఐ దంపతులు ఆలయంలోని మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవిని దర్శించుకున్నారు. నేటి (సోమవారం) వేకువజామున సుప్రభాతం, మహామంగళ హారతి సేవలో సీజేఐ దంపతులు పాల్గొన్నారు. ఎన్వీ రమణ దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనానంతంరం సీజేఐ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి విగ్రహాలు చాలా ప్రసిద్ధమైనవి. భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కూడా ఒకటి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ