విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ను అక్టోబర్ 16 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.502 కోట్ల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అబ్బురపరిచేలా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. కాగా తాజాగా ఈ ఫ్లైఓవర్ పై పగటి సమయంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాత్రి 11 గంటల తర్వాత మాత్రం ప్రైవేట్ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను అనుమతించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ