సీఎం జగన్ కీలక నిర్ణయం.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియామకం

CM Jagan Appoints Adala Prabhakar Reddy as YSRCP Coordinator For Nellore Rural Constituency,CM Jagan Appoints,Adala Prabhakar Reddy,YSRCP Coordinator,Nellore Rural Constituency,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని నియమించారు. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం సజ్జల దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని, సీఎం జగన్ ను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుత నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. తనను అవమానించిన చోట పనిచేయలేనని, ఇకపై వైసీపీలో కొనసాగలేనని మీడియా సమావేశంలో ప్రకటించడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని కొత్తగా నియమించారు. ఇక రూరల్‌ ఇన్‌చార్జిగా నియమించడం సంతోషంగా ఉందని, ఇక్కడ పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =