రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం నాలుగో విడత ఆర్ధికసాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికపై లబ్దిదారులకు రూ. 261.51 కోట్లు సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే..
- పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ప్రారంభించాం.
- దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తున్నాం.
- కరోనా మహమ్మారి సమయంలోనూ పథకం ఆగకుండా లబ్దిదారులకు నగదు పంపిణీ చేశాం.
- ఈ మూడేళ్లలో రూ. 1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.
- వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నాం.
- ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.
- అలాంటి వారందరికీ గల ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున అందిస్తున్నాం.
- ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఈ ఏడాది మొత్తం 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నాం.
- ఈ నాలుగు విడతల్లో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేశాం.
- రాష్ట్రంలో లంచాలు, వివక్ష లేకుండా కులం, మతం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ