దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ కూడా 20 వేలకుపైగానే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 4,50,820 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 20,038 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 4.44 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,37,10,027 కు చేరుకుంది. అలాగే మరో 47 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,604 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, అస్సాం, ఢిల్లీ, తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 16,994 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,30,45,350 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.48 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,39,073 (0.32%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూలై 14 (8am)–జూలై 15 (8am)):
- కేరళ – 3237
- పశ్చిమబెంగాల్ – 3029
- మహారాష్ట్ర – 2229
- తమిళనాడు – 2283
- కర్ణాటక – 1209
- ఒడిశా – 804
- గుజరాత్ – 737
- అస్సాం – 707
- ఢిల్లీ – 520
- తెలంగాణ – 512
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY