ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ.35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాని పక్షంలో రైతాంగానికి మద్దతుగా సోమవారం నాడు అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా పవన్ కళ్యాణ్ తన నివాసంలో ఉదయం 10 గంటలకు దీక్షలో కూర్చున్నారు. అలాగే రైతాంగానికి మద్దతుగా సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలు చేపడుతున్నారు.
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి డిమాండ్ కు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా ఈ రోజు తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నారు.#JanaSenaRythuDeeksha pic.twitter.com/f9uIvaoo8s
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ