ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతుల శ్రేయస్సు కోసం మరికొన్ని కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖపై సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
మత్స్యశాఖపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- మొదటిదశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం సహా ఉప్పాడలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి.
- రెండోదశలో వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులపై ఆరా.
- మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.3,520.57 కోట్లు కేటాయించినట్లు వెల్లడి.
- ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వలన మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి, ఆదాయం పెరుగుతుందని.. తద్వారా జీడీపీ పెరుగుతుందని తెలిపారు.
- రాష్ట్రంలోని ఆక్వా రైతులకు మేలు చేయడానికే ఫీడు, సీడు రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకొచ్చినట్లు వెల్లడి.
- మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- అలాగే సహకార రంగం మాదిరిగా ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE