ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన సర్వే పురోగతిని సమీక్షించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 ఏళ్ల తర్వాత సర్వే నిర్వహిస్తున్నామని, ఈ సర్వే పూర్తయితే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన దీనిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భూములపై దశాబ్దాలుగా ఉన్న సమస్యలను ఈ ట్రైబ్యునల్స్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే సర్వే చేపడుతున్న క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి సమాయత్తమై ఉండాలని, ఎక్కడికక్కడ వీటిని పరిష్కరించి ముందుకు సాగాలని సూచించారు. అలాగే మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు వివాదాలు లేని భూమిని పొందడం కోసమే ప్రభుత్వం ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ పథకం తీసుకొచ్చామని గుర్తు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY