గాంధీ జయంతి సందర్భంగా శనివారం ఉదయం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల పాటు క్లాప్-జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ