ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని తెలిపారు. అలాగే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ముందుగా స్వల్ప లక్షణాలు కనిపించడంతో, ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. వంగవీటి రాధా కూడా ప్రస్తుతం ఏఐజీలో ఆసుపత్రిలోనే చేరి చికిత్స పొందుతున్నారు. మరోవైపు జనవరి 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ