ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన వివిధ అసోసియేషన్లకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల వినతి మేరకు డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరామని, ఇంకా రెండు డీఏలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. కాగా తాము చెప్పిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, సంక్రాంతికి ఒక డీఏ, ఏప్రిల్ నుంచి ఎరియర్స్ ఇస్తామని చెప్పారని, అలాగే బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE