తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతి కుమారి

IAS Officer Santhi Kumari Takes Charge as New Chief Secretary of Telangana at BRKR Bhavan,IAS Officer Santhi Kumari,Santhi Kumari,Santhi Kumari New Chief Secretary of Telangana,New Chief Secretary of Telangana,Mango News,Mango News Telugu,Ramakrishna Rao,Ramakrishna Rao Likely To Be CS Of Telangana,CS Of Telangana,Telangana State New CS Santhi Kumari,Telangana CS Santhi Kumari,CS Santhi Kumari Meets CM KCR,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన సీఎస్ గా బీఆర్కేఆర్ భ‌వ‌న్‌లోని సీఎస్ ఛాంబ‌ర్‌లో బుధవారం సాయంత్రం శాంతి కుమారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీఆర్కేఆర్ భవన్ లో శాంతి కుమారి విలేకరులతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సీఎస్ శాంతి కుమారి అన్నారు.

సీఎం కేసీఆర్ తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి, తన శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతోపాటు అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సీఎస్ శాంతి కుమారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =