ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కొనసాగనున్న ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వేముల మండలం వేల్పులలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్ ప్రారంభించనున్నారు. అలాగే 2వ తేదీన ఇడుపులపాయలో ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 1వ తేదీ షెడ్యూల్..
- సీఎం జగన్ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- గన్నవరం నుంచి 2.30 గంటలకు విమానంలో బయలుదేరి కడపకు వెళ్తారు.
- కడప విమానాశ్రయం నుంచి 3.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు.
- అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో సమావేశమవుతారు.
- 4.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు.
- ఇక సాయంత్రం 5.15 గంటలకు వేల్పుల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.
- ఆరోజు రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో బస చేస్తారు.
సెప్టెంబర్ 2వ తేదీ షెడ్యూల్..
- ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు.
- అక్కడ 9 గంటల నుంచి 9.40 గంటల వరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
- అనంతరం 9.45 గంటలకు బయలుదేరి ఎస్టేట్లోని ప్రేయర్ హాల్ కు చేరుకొని పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సాయంత్రం 5 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు.
- ఆ తర్వాత 5.10 గంటలకు వైఎస్సార్ గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
సెప్టెంబర్ 3వ తేదీ షెడ్యూల్..
- ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కడప చేరుకుంటారు.
- 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.
- అక్కడ నుంచి ఉదయం 10.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ