ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో జరిగే ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిలో భాగంగా నాలుగో ఏడాది మూడో విడత ఇన్పుట్ సబ్సిడీ నగదును పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఇన్పుట్ సబ్సిడీ నగదును జమ చేయనున్నారు. అలాగే ఇటీవల ఇతర కారణాలతో పంటలు నష్టపోయిన పలువురు రైతులకు కూడా నగదు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇక సీఎం జగన్ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరియు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తదితరులు ఇప్పటికే తెనాలి ఏఎంసీ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు, గ్రీన్ రూంలు, టెంట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఈ ఏర్పాట్లలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్, తెనాలి డిఎస్పీ స్రవంతి రాయ్, తహశీల్దార్ కె.రవిబాబు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్ తెనాలి షెడ్యూల్..
- మంగళవారం ఉదయం 9:50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి తెనాలి బయలుదేరతారు.
- ఉదయం 10:15 గంటలకు తెనాలి పట్టణం చేరుకుంటారు.
- ఉదయం 10:35 గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
- ఉదయం 11గంటల సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
- బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ నగదును జమ చేస్తారు.
- అనంతరం హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
- ఇక మధ్యాహ్నం 12:45 గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత బయలుదేరి 1:10 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE