ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 8న కడప జిల్లాలోని తన నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు కడప జిల్లా పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 8 న 9:35 A.M కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు, అక్కడి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ నుంచి భాకరాపురం చేరుకొని, తన బాబాయ్ వై.ఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేవు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
దివంగత వై.ఎస్ వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి జగన్ భాకరాపురం నుంచి బయలుదేరి పులివెందుల ఆర్&బి గెస్ట్ హౌస్ కి వెళతారు. అక్కడ పులివెందుల నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో గంట పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడి, నియోజకవర్గ సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు విరామం తరువాత పులివెందుల గాయత్రీ కాలనీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుండి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్లనున్నారు.
[subscribe]
[youtube_video videoid=-NQeReWz37U]