జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu Naidu Comments On CM Jagan Decisions,Mango News,Chandrababu Naidu Strong Comments On CM YS Jagan,Nara Chandrababu Naidu About CM Jagan Decisions,Andhra Pradesh Political News,Ap Political News Live Updates,Chandra Babu Naidu comments on CM YS Jagan Mohan Reddy

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓటమిపై స్పందిస్తూ కేవలం 23 సీట్లు గెలవడం బాధగావుందన్నారు. తనను నమ్మి 34 వేల ఎకరాలు రాజధానికోసం రైతులు ఇచ్చారని, ఒక ప్రపంచస్థాయి రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం కష్టపడితే, ఈ రోజు అది వెలవెలబోయిందని చెప్పారు. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ కలిసినపుడు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు చెప్పి నిధులు అడగకుండా, తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ను విమర్శించారు.

ఇసుకను ఉచితంగా ఇస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా అని దుష్ప్రచారం చేసారని చంద్రబాబు మండిపడ్డారు. నేడు జగన్ ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇసుక లారీలను పంచుకుంటున్నారని విమర్శించారు. పులివెందుల పంచాయితీలను ఇక్కడ అమలు చేయాలనీ చూస్తున్నారని, తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక సంక్షేమపథకాలను ఆపేసారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పనులు అకారణంగా పక్కన పెట్టారన్నారు. చివరికి అన్న క్యాంటీన్లు కూడ అవినీతి పేరుతో మూసేయడం బాధ కలిగిస్తుందని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=jvHzusINWtk]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =