వైఎస్సార్సీపీ ఫ్లీనరీ ఘనంగా ప్రారంభం, మొదటి రోజు షెడ్యూల్‌ ఇదే…

YSRCP Plenary 2022 Begins at Guntur Party will Introduce Five Resolutions on First Day, YSRCP Plenary-2022 Day 1 CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, YSRCP Plenary-2022, 2022 YSRCP Plenary, YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, Guntur YSRCP Leaders Monitoring Arrangements, ALL Arrangements in full swing for YSRCP plenary at Guntur, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ ఫ్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో జరిగే పార్టీ ప్లీనరీకి వైఎస్సార్సీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక ఇది మూడో ప్లీనరీ కాగా, 2019లో ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ స్థాయిలో నిర్వహిస్తుంది. రెండు రోజుల పాటుగా జరిగే పార్టీ ఫ్లీనరీకి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా జెడ్పి ఛైర్మన్స్, ముఖ్య నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు సహా లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

మరోవైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ విజయమ్మ ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి వైఎస్సార్సీపీ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీగా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లను ఏర్పాటు చేశారు. ముందుగా ప్లీనరీ ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు.

వైఎస్సార్సీపీ ఫ్లీనరీ మొదటి రోజు షెడ్యూల్‌ ఇదే:

  • ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకున్నారు.
  • పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం నిర్వహణ
  • అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • 20 నిమిషాల పాటుగా ప్రార్ధన నిర్వహణ
  • దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న సీఎం వైఎస్‌ జగన్
  • పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్న సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
  • పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం
  • పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశం
  • పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదించడం, ప్లీనరీ ఆమోదం కోరడం
  • అనంతరం పార్టీ నియమావళి సవరణలు ప్రతిపాదించడం, ప్లీనరీ ఆమోదం కోరడం
  • పార్టీ కార్యక్రమాల నివేదన
  • వరుసగా ప్రారంభం కానున్న తీర్మానాలు
  • మొదటి తీర్మానంగా మహిళా సాధికారత-దిశ చట్టం తీర్మానం
  • అనంతరం విద్య పై తీర్మానం
  • సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
  • నవరత్నాలు-డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం
  • వైద్యంపై తీర్మానం
  • మొదటిరోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్లీనరీ సమావేశం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =