ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉద్యోగాల కల్పన పై ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం,తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని చెప్పారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామవాలంటీర్లు, ఒక్కో గ్రామసచివాలయానికి 10 మంది ఉద్యోగులను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రామవాలంటీర్లుకు సంబంధించిన పూర్తీ స్థాయి పక్రియ ఆగస్ట్ 15 కల్లా, గ్రామసచివాలయ నియామకాలు అక్టోబర్ 2 కల్లా పూర్తీ అవుతాయి.
అంతే కాకుండా రిజర్వేషన్స్ పై కూడ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. దేశ,రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని మరియు సుదినం అని చెప్తూ, ఇచ్చిన మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం, 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించామన్నారు. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం అని ముఖ్యమంత్రి జగన్ తెలియజేసారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2019
దేశ,రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019
[subscribe]
[youtube_video videoid=aWXGkQYUMno]