భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-2, రాకెట్ నుండి విడిపోయి భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఇస్రో లో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు.20 గంటల కౌంట్ డౌన్ తరువాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43నిముషాలకు, నింగికెగిసిన జీఎస్ఎల్వి మార్క్-3ఎం1 రాకెట్ 16 నిముషాల 13 సెకండ్ల పాటు ప్రయాణించి భూకక్షలోకి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది. ఉపగ్రహం ప్రయాణదూరాన్ని అనుసరించి, సెప్టెంబర్ 7న చంద్రుని పై దిగనుంది.
ఇస్రో చైర్మన్ కే.శివన్ మాట్లాడుతూ ఇస్రో,భారతదేశం,మొత్తం ప్రపంచం ఈ మిషన్ కోసం ఎదురుచూస్తుందని చెప్పారు. ప్రయోగం తాము ఊహించిన దాని కంటే విజయవంతమైందని, ఇది భారతీయులకు చారిత్రాత్మక రోజు అని చెప్పారు. చంద్రయాన్ -2 ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోడీ స్పందిస్తూ, మన అద్భుతమైన చరిత్రలో పొందుపరిచే ప్రత్యేకమైన క్షణాలు ఇవి అని అన్నారు. చంద్రయాన్ 2 యొక్క ప్రయోగం మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని మరియు సైన్స్ యొక్క కొత్త సరిహద్దులను కొలవడానికి 130 కోట్ల మంది భారతీయుల దృడ నిశ్చయాన్ని సూచిస్తుందని, ప్రతి భారతీయుడు ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాడు అని చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలు, ప్రజా పతినిధులు, సినిమా సెలబ్రిటీలు, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#ISRO#GSLVMkIII-M1 lifts-off from Sriharikota carrying #Chandrayaan2
Our updates will continue. pic.twitter.com/oNQo3LB38S
— ISRO (@isro) July 22, 2019
#GSLVMkIII-M1 successfully injects #Chandrayaan2 spacecraft into Earth Orbit
Here’s the view of #Chandrayaan2 separation#ISRO pic.twitter.com/GG3oDIxduG— ISRO (@isro) July 22, 2019
Special moments that will be etched in the annals of our glorious history!
The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.
Every Indian is immensely proud today! pic.twitter.com/v1ETFneij0
— Narendra Modi (@narendramodi) July 22, 2019
[subscribe]
[youtube_video videoid=wXhS2H1kYH0]