ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రంజాన్’ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. “సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #EidMubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2022
ముస్లింల మత గ్రంధం పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసం వారికి ఎంతో ప్రత్యేకమైనదని వైఎస్ జగన్ తెలిపారు. ‘అల్లా’ దయ కోసం ఈ రంజాన్ మాసం అంతా ముస్లింలు కఠిన ఉపవాస దీక్ష పాటిస్తారని, నిరంతరం దైవ చింతనలో గడుపుతారని వెల్లడించారు. అల్లా సూచనల మేరకు.. మనసులోని చెడు భావనలను దూరం చేసి సర్వ మానవాళి పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ, దయతో మెలిగేలా వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ