ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడిపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించారు. తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేసిన 500 పడకల జర్మన్ హ్యాంగర్ల ఆసుపత్రిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో కేవలం 15 రోజుల్లోనే 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో ఈ కోవిడ్ ఆసుపత్రిని నిర్మించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ తరహా ఆసుపత్రిని తాడిపత్రిలో ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ప్రతి పడకకు ఆక్సిజన్ సరఫరా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ