సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్‌

CM YS Jagan Lays Foundation Stone For Green Field Port at Moolapeta Srikakulam District Today,CM YS Jagan Lays Foundation Stone,Green Field Port at Moolapeta,Moolapeta Srikakulam District Today,Mango News,Mango News Telugu,Andhra CM Lays Foundation Stone,Green Field Port at Moolapet,CM Jagan During Srikakulam District Visit,YS Jagan visit Srikakulam,Bhumi Puja,Jagans schedule for Moolapet,Andhra Pradesh CM YS Jagan Mohan Reddy,Bhavanapadu Greenfield Port Foundation Stone,YS Jagan to lay stone for Bhavanapadu Port,CM Jagan Latest News and Updates,Srikakulam District Live News,Moolapet Foundation Stone Latest News

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపడుతున్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి ముందు గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించి.. ఆపై నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు మరియు హిర మండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు కూడా సీఎం జగన్‌ శంకుస్ధాపన నిర్వహించారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

సీఎం జగన్‌ ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..

  • మూలపేట పోర్టును నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
  • ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్థంభంగా నిలుస్తుంది.
  • పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయనున్నాం.
  • ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 35 వేల మందికి ఉపాధి దొరకుతుంది.
  • ఈ పోర్టు అందుబాటులోకి వస్తే మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరుకుల రవాణా మరింత సులభం కానుంది.
  • దీని వలన భవిష్యత్తులో పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతాయి.
  • వాటి ద్వారా ఇక్కడి యువతకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి.
  • గంగపుత్రుల కళ్ళల్లో వెలుగులు నింపేందుకే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం.
  • భవిష్యత్ రోజుల్లో మూలపేట, విష్ణు చక్రం.. మరో ముంబై, మద్రాస్ కోబోతున్నాయి.
  • ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం.
  • దీనిలో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నాం.
  • రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్టణం.
  • అందుకే దీనిని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాం.
  • వచ్చే సెప్టెంబర్ నుంచి ఇక్కడే ఉంటా, ఇక్కడినుంచే పాలన సాగిస్తా.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =