ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముందుగా గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం చర్చించినట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పరిష్కారం కాని వివిధ సమస్యలు, రాష్ట్రపతి ఎన్నికల అంశం సహా మొత్తం పలు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి, సీఎం వైఎస్ జగన్ వివరించనున్నట్టుగా సమాచారం. సీఎం వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. మరోవైపు ఏప్రిల్ నెలలో కూడా సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ ఓసారి భేటీ అయ్యారు.
ఇక ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ పర్యటనలో బాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF