ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. వరద పరిస్థితిని సీనియర్ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి, వరద బాధిత జిల్లాల జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అయితే తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ సహా గోదావరి బేసిన్లోని అన్ని రిజర్వాయర్ల నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నందున నేటి సాయంత్రానికి రాజమహేంద్రవరం వద్దనున్న ధవళేశ్వరం బ్యారేజీకి సుమారు 23-24 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్, ఉభయ గోదావరి జిల్లాల లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి, పునరావాస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అవసరమైతే ప్రజల తరలింపుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద పరిస్థితులను అంచనావేస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ