ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా, ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు పున:ప్రారంభించబడుతున్న సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ ప్రారంభించనున్నారు. దీనికోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు సీఎం జగన్ ఆదోని వస్తున్నారని, పిల్లలకు అవసరమైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తదితరులు పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ