తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించే తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) సోమవారం వెల్లడించింది. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 7, ఆదివారం మరియు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 21, ఆదివారం నాడు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ రాత పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. అలాగే ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 30 నుంచి, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఆగస్టు 10 నుంచి https://www.tslprb.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
554 ఎస్సై సివిల్/తత్సమాన స్థాయి పోస్టుల కోసం ఆగస్టు 7న మరియు 15,644 పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఖాళీలకై ఆగస్టు 21 ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు దాదాపు 2,45,000 మంది అభ్యర్థులు, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 6,50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY