సంగారెడ్డిలో రూ. 50 కోట్ల‌తో చేపట్టిన వివిధ అభివృద్ధి ప‌నులను ప్రారంభించిన మంత్రి హ‌రీష్ రావు

Telangana Minister Harish Rao Launches Several Developmental Works Worth of Rs 50 Cr in Sangareddy Town, Minister Harish Rao Launches Several Developmental Works Worth of Rs 50 Cr in Sangareddy Town, Harish Rao Launches Several Developmental Works Worth of Rs 50 Cr in Sangareddy Town, Several Developmental Works Worth of Rs 50 Cr in Sangareddy Town, Sangareddy Several Developmental Works, Several Developmental Works Worth of Rs 50 Cr, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Telangana Finance Minister, Minister Harish Rao, Harish Rao, Sangareddy Developmental Works, Sangareddy, Sangareddy Developmental Works News, Sangareddy Developmental Works Latest News, Sangareddy Developmental Works Latest Updates, Sangareddy Developmental Works Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన ప‌ట్ట‌ణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లాకు వ‌చ్చిన స్పేస్ ఆన్ వీల్స్ బ‌స్సుతో పాటు సైన్స్ మ్యూజియాన్ని సంద‌ర్శించిన మంత్రి ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌తో కొద్దిసేపు సంభాషించారు. అనంత‌రం మంత్రి హ‌రీష్ రావు ప్ర‌సంగిస్తూ.. సంగారెడ్డి ప‌ట్ట‌ణం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్ర‌త్యేకంగా రూ. 50 కోట్ల నిధులు కేటాయించార‌ని, త్వ‌ర‌గా టెండ‌ర్లు పిలిచి వేగంగా ప‌నులను మొద‌లు పెట్టాల‌ని అధికారులకు సూచించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇకపై త్రాగునీటి స‌మ‌స్య ఉండ‌ద‌ని, జిల్లాలోని ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని హ‌రీష్ రావు పేర్కొన్నారు. దీనికోసం రూ. 15 కోట్లతో 4 వాటర్ ట్యాంక్‌లు నిర్మించి ఇంటింటీకి త్రాగునీరు ఇచ్చే ఏర్పాటు చేశామ‌ని వెల్లడించారు.

అలాగే పట్టణంలో 650 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో మెడిక‌ల్ కాలేజీ నిర్మాణం జ‌రుగుతోందని, దీనికోసం రూ. 500 కోట్ల‌ నిధులను కేటాయించామని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. త్వరలోనే దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీష్ పేర్కొన్నారు. ఇంకా బీసీ బాలిక‌ల కోసం ప్రత్యేక కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నం కూడా నిర్మించనున్నామని, ఎన్నో ఏళ్లుగా పట్టణవాసులు ఎదురు చూస్తున్న సంగారెడ్డి మున్సిప‌ల్ కాంప్లెక్స్‌ను నేడు ప్రారంభించుకున్నామని మంత్రి అన్నారు. చింత‌ల‌ప‌ల్లిలో 15 వార్డుల బస్తీ దవాఖానతోపాటు డయాలసిస్ సెంటర్‌ను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశామని, అలాగే మ‌రికొన్ని బ‌స్తీ ద‌వ‌ఖానాలు కూడా త్వరలో ప్రారంభిస్తామ‌ని హ‌రీష్ హామీ ఇచ్చారు. చిన్నారులకు మరియు మహిళలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉంచామని హ‌రీష్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =