ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 215 కరోనా పాజిటివ్ కేసులు, 1 మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 6, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,921 కు, మరణాల సంఖ్య 14,392 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 406 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,49,961 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,568 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(215):
- కృష్ణా – 37
- చిత్తూరు – 33
- విశాఖపట్నం – 27
- తూర్పుగోదావరి – 26
- గుంటూరు – 24
- నెల్లూరు – 17
- ప్రకాశం – 12
- శ్రీకాకుళం – 12
- కడప – 11
- పశ్చిమగోదావరి – 10
- అనంతపూర్ – 4
- విజయనగరం – 1
- కర్నూల్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ