కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూన్ 11, గురువారం నాటికే 5,10,318 సాంపిల్స్ కి పరీక్షలు చేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రతి మిలియన్ జనాభాకు 9,557 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఏపీలో కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగింది.
మరోవైపు గురువారం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5429 కు చేరింది. మొత్తం కేసుల్లో రాష్ట్రంలో నమోదైనవి 4261 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 971, విదేశాల నుంచి వచ్చిన వారు 197 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2540 కు చేరగా, మరణాల సంఖ్య 80 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1641 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh has tested 5,10,318 samples till date for #COVID19. Among all the states in India, AP continues to stay on top with 9557 tests/million #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ac4NAnfMkK
— ArogyaAndhra (@ArogyaAndhra) June 11, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu