దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 11, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,86,579 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలో జూన్ 15 నుంచి మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయవచ్చని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, రైలు మరియు విమాన ప్రయాణాలను కూడా నిషేధించబోతుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఐబి (భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం) ఫాక్ట్ చెక్ స్పందించింది. మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ న్యూస్ అని, ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ తప్పుదోవ పట్టించే ఫోటోల పట్ల జాగ్రత్త వహించండని పిఐబి ఫాక్ట్ చెక్ వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, సంబంధిత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే అనేక తప్పుడు ప్రచారాలపై పిఐబి ఫాక్ట్ చెక్ నిజ నిర్ధారణ చేసి వివరణ ఇస్తూ ఉంటుంది.
दावा: सोशल मीडिया पर फैलाई जा रही एक फोटो में दावा किया जा रहा है कि गृह मंत्रालय द्वारा ट्रेन और हवाई यात्रा पर प्रतिबंध के साथ 15 जून से देश में फिर से पूर्ण लॉकडाउन लागू किया जा सकता है।#PIBFactcheck– यह #Fake है। फेक न्यूज़ फैलाने वाली ऐसी भ्रामक फोटो से सावधान रहें। pic.twitter.com/DqmrDrcvSz
— PIB Fact Check (@PIBFactCheck) June 10, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu