ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష 50 వేలు దాటింది. కొత్తగా 9276 కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 150209 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 147314 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 1407 కి చేరింది. ఇప్పటికి 76614 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో కలిపి మొత్తం 72188 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 21274
- కర్నూల్ – 18081
- అనంతపూర్ – 15827
- గుంటూరు – 15669
- పశ్చిమ గోదావరి – 12804
- విశాఖపట్నం – 11920
- చిత్తూరు – 11327
- కడప – 8423
- నెల్లూరు – 7875
- కృష్ణా – 7200
- శ్రీకాకుళం – 7025
- ప్రకాశం – 5569
- విజయనగరం – 4323
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu