కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, లాక్డౌన్కు దేశ ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని అన్నారు. ప్రజలంతా లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేయాలంటున్నారు. అలాగే లాక్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందనే ప్రశ్నలు వేస్తున్నారు.ఈ సమయంలో ప్రజలంతా ఇంట్లో ఉంటే కరోనాపై విజయం సాధించినట్లే. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటారు. ప్రపంచదేశాలన్నీ ప్రస్తుతం మన బాటలోనే నడుస్తున్నాయి. భారతీయులంతా ఒక్కటై కరోనాను తరిమికొడతారని మోదీ పేర్కొన్నారు.
ఈ సమయంలో లాక్డౌన్ ను మరింత కఠినంగా పాటించాలి. వచ్చే ఆదివారం నాడు దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పాన్ని మరోసారి తీసుకోవాలి. మనం అంధకారంలో ఉన్నామన్న భావన నుంచి ముందు బయటకురావాలి. ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేయాలి. ఈ సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలి. ఆ దీపం వెలుగు మనలో స్ఫూర్తి నింపాలి. 130 కోట్ల మంది 9 నిమిషాల సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. దీంతో మనం ఒంటరికాదు అనే భావన తొలిగిపోయి, ఈ సమయంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోదీ తన సందేశాన్ని ముగించారు.
A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020
[subscribe]