ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కు చేరుకుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 60804 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 10392 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1199, కర్నూల్ జిల్లాలో 697, కృష్ణా జిల్లాలో 397, కడప జిల్లాలో 800, గుంటూరు జిల్లాలో 900, చిత్తూరు జిల్లాలో 1124, అనంతపూర్ జిల్లాలో 810, నెల్లూరు జిల్లాలో 942, ప్రకాశం జిల్లాలో 800, శ్రీకాకుళంలో 603, విశాఖపట్నంలో 675, విజయనగరంలో 560, పశ్చిమగోదావరిలో 885 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో 72 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 4125 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 8454 మంది కోలుకోవడంతో, ఇప్పటికి డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 3,48,330 కు చేరింది. అలాగే ప్రస్తుతం 103076 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 2 నాటికీ ఏపీలో 38,43,550 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu