ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్, మొబైల్ యాప్ యొక్క ట్విట్టర్ ఖాతా ఈ రోజు తెల్లవారుజామున హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ధృవీకరించింది. భారత ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే ఈ ఖాతా పునరుద్దరణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. హ్యాకర్లు ఈ ఖాతాకి ఉన్న ఫాలోయర్స్ ను క్రిప్టోకరెన్సీ ద్వారా పీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ఇవ్వమని ట్వీట్స్ చేసినట్టుగా తెలుస్తుంది.
2011 మేలో వ్యక్తిగత వెబ్సైట్ కు అనుసంధానంగా మొదలుపెట్టిన పీఎం మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా (narendramodi_in) ని 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అదేవిధంగా పీఎం మోదీ ఇప్పటికి 37,000 ట్వీట్లు చేశారు. మరోవైపు జూలై నెలలో కూడా అమెరికాలో ప్రముఖ వ్యక్తులు, ధనవంతులని లక్ష్యంగా చేసుకుని వారి ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు పెద్దఎత్తున దాడి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్, నటి కిమ్ కర్ధాషియన్, కాన్యేవెస్ట్, మైకేల్ బ్లూమ్బెర్గ్, ఆపిల్, ఉబర్ సహా పలువురి ఖాతాలు హ్యాకింగ్కు గురైనాయి. బ్లూ టిక్ కలిగిన ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు పెట్టి గందరగోళం సృష్టించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu