ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 50972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11698 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1641, గుంటూరులో 1581, చిత్తూరులో 1306, అనంతపూర్ లో 1066 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926 కు చేరుకుంది.
ఇక కరోనా వలన తూర్పుగోదావరిలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూరులో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరియు ప్రకాశంలో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7616 కి పెరిగింది. గత 24 గంటల్లో 4421 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 9,31,839 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ