ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 40,635 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూల్ లో 1710, గుంటూరులో 1625, కడపలో 1215, విశాఖపట్నం జిల్లాలో 1211, తూర్పుగోదావరిలో 1067, కృష్ణాలో 1056, నెల్లూరులో 1009 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,48,608 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమగోదావరి, అనంతపురం, చిత్తూరు, గుంటూరు మరియు విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14591 కు చేరింది. గత 24 గంటల్లో 8,742 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,20,717 చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,23,65,775 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ