దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా “పద్మ భూషణ్” పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ కాగా, 2021లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. తనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడంపై సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“పద్మభూషణ్ అవార్డును స్వీకరించడం మరియు చాలా మంది అసాధారణ వ్యక్తులతో కలిసి గుర్తింపు పొందడం గౌరవంగా ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు భారతదేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భారతదేశం అంతటా ప్రజలతో కలిసి పని చేయడం కోసం, మరిన్ని విజయాలు సాధించడానికి సాంకేతికతను ఉపయోగించడంలో వారికి సహాయపడటానికి నేను ఎదురు చూస్తున్నాను” అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ