ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 22, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,371 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 22, నెల్లూరులో 22, గుంటూరులో 18, కృష్ణాలో 15, తూర్పుగోదావరిలో 15, విశాఖపట్నంలో 15 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 184 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14428 కి పెరిగింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 22, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,01,97,561
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 18,777
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 20,71,371
- కొత్తగా నమోదైన కేసులు : 127
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,54,737
- యాక్టీవ్ కేసులు : 2,206
- మొత్తం మరణాల సంఖ్య : 14,428
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ