ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1174 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 18, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353 కు, మరణాల సంఖ్య 14,061 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,309 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,08,639 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1174):
- తూర్పుగోదావరి – 208
- ప్రకాశం – 161
- చిత్తూరు – 159
- కృష్ణా – 140
- గుంటూరు – 131
- నెల్లూరు – 122
- పశ్చిమగోదావరి – 80
- కడప – 69
- విశాఖపట్నం – 55
- అనంతపూర్ – 18
- శ్రీకాకుళం – 16
- విజయనగరం – 10
- కర్నూల్ – 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ