ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 19, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,58,711 కు, మరణాల సంఖ్య 6910 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 75,165 కరోనా పరీక్షలు నిర్వహించగా 1316 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 11 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరియు నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6910 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,35,801 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 1821 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 16000 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ