ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1263 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 56, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. కొత్తగా నమోదైన 1322 కేసులతో కలిపి జూలై 6, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20019 కు చేరింది. గత 24 గంటల్లో 16,712 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కరోనా వలన శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 239 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 8920 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8606 మంది ఆసుపత్రుల్లో, 2254 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 10860 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 06/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,365 పాజిటివ్ కేసు లకు గాను
*7252 మంది డిశ్చార్జ్ కాగా
*239 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9874#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0xVb7XgnHP— ArogyaAndhra (@ArogyaAndhra) July 6, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu