ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. డిసెంబర్ 21, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,937 కు, మరణాల సంఖ్య 7078 కు చేరుకుంది. ఆదివారం 9AM నుంచి సోమవారం 9AM వరకు 40,295 కరోనా పరీక్షలు నిర్వహించగా 214 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. మరోవైపు గత 24 గంటల్లో 422 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,67,867 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3992 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ