యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే అధిక కరోనా ప్రభావం కలిగిన మహారాష్ట్ర రాష్ట్రం ముందస్తు చర్యలకు దిగింది. ఈ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఈ రోజు అధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 22 నుండి జనవరి 5, 2021 వరకు 15 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరూ తప్పనిసరిగా 15 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ కాకుండా ఇతరదేశాల నుండి వచ్చే ప్రయాణీకులు అదే సమయం పాటుగా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ