ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 90,750 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 21452 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, కర్నూల్, ప్రకాశం, పశ్చిమగోదావరి, కడప వంటి 11 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,44,386 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 89 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 8988 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 19095 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 11,38,028 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1,97,370 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,76,05,687 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(21452):
- నెల్లూరు – 1689
- తూర్పుగోదావరి – 2927
- గుంటూరు – 1836
- విశాఖపట్నం – 2238
- శ్రీకాకుళం – 1285
- చిత్తూరు – 1908
- కర్నూల్ – 1524
- విజయనగరం – 693
- ప్రకాశం – 1192
- కడప – 1746
- అనంతపూర్ – 2185
- కృష్ణా – 997
- పశ్చిమగోదావరి – 1232
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ