కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 3వ తేది వరకు భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనం నిలిపివేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే జిల్లాల్లో కరోనా బాధితులను ఆదుకొనేందుకు టీటీడీ భారీ విరాళాన్ని ప్రకటించింది.
లాక్డౌన్ వలన రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో నిలిచిపోయిన పేదలు, వలస కూలీల ఇబ్బంది పడుతున్నారని, వారి ఆకలి తీర్చేందుకు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ ద్వారా ప్రతి జిల్లాకు కోటి రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిధులను జిల్లా కలెక్టర్ లకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఆకలితో ఉన్న పేదల అన్నదానం కోసం ఈ నిధులు అందజేస్తామని, ఇంకా అవసరం అయితే మరికొన్ని నిధులు కూడా విరాళంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu